: ఆ కాలేజీలో బాలికల దుస్థితిని చూసి షాక్కు గురయ్యానని ట్విట్టర్లో పేర్కొన్న ఎంపీ కవిత
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పక్కనే శ్మశానం ఉండడంతో ఆ కాలేజీ విద్యార్థినులు తరగతి గదిలో ముక్కు మూసుకొని అవస్థలు పడుతూ పాఠాలు నేర్చుకుంటున్నారంటూ మీడియాలో వచ్చిన కథనానికి టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత చలించిపోయారు. తాజాగా ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ అంశంపై స్పందిస్తూ ఆ వార్తను చదివి షాక్కు గురయ్యానని, వారి సమస్యలను తీర్చడానికి తాను ఇప్పటికే సంబంధిత అధికారులతో మాట్లాడానని పేర్కొన్నారు. కాగా, విద్యార్థినుల దుస్థితి గురించి తెలుసుకున్న జిల్లా అధికారులు కాలేజీకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను తెలుసుకుని సమస్య తీర్చేందుకు నడుం బిగించారు.
I was shocked to read this news as well ... am already speaking with authorities https://t.co/vHlMOErfwf
— Kavitha Kalvakuntla (@RaoKavitha) 7 February 2017