: అమ్మ మరణం వెనుక రహస్యం తెలియాల్సిందే... హైకోర్టు జడ్జితో విచారణ చేయిస్తాం!: పన్నీర్ సెల్వం

తనతో పాటు 7 కోట్ల మంది తమిళ ప్రజలకు అమ్మ మరణంపై అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిందేనని పన్నీర్ సెల్వం తేల్చిచెప్పారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన, శశికళ వర్గంపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ఆసుపత్రిలో అమ్మ వద్దకు తనను కూడా అనుమతించలేదని, అసలు ఏ కారణంతో అమ్మ మరణించారు? అంత రహస్యంగా ఎలాంటి వైద్యం ఆమెకు అందించారు? మరణానికి అసలు కారణాలేంటి? తదితర విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని పన్నీర్ అన్నారు. తన ప్రాణాలు అర్పించి అయినా, పార్టీని, ప్రభుత్వాన్ని రక్షించుకుంటానని, అమ్మ ప్రారంభించిన ప్రజారంజక పాలన రాష్ట్రంలో కొనసాగి తీరుతుందని అన్నారు.

More Telugu News