: బంగ్లాతో టెస్టులో అరంగేట్రం చేయనున్న భారత్ యువ ఆటగాడు

హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌ తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కు టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్థానంలో యువ ఆటగాడికి సెలెక్టర్లు స్థానం కల్పించారు. ఇంగ్లండ్ తో జరిగిన చివరి టీ20లో ఫీల్డింగ్ చేస్తూ అమిత్ మిశ్రా గాయపడడంతో అతనికి విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ కు తుది జట్టులో స్థానం కల్పించారు.

కాగా, అశ్విన్, జడేజా వంటి అత్యుత్తమ స్పిన్నర్లతో కుల్దీప్ జట్టు బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నాడు. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లోని రెండు ఇన్నింగ్సుల్లో కుల్దీప్ 1/32, 2/2 గణాంకాలతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇప్పటి వరకు 22 ఫస్ట్ క్లాస్ మ్యాచులాడిన కుల్దీప్ 33.11 సగటుతో 81 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో 5 వికెట్ల ప్రదర్శనతో కుల్దీప్ ఆకట్టుకున్నాడు. దీంతో సెలెక్టర్లు అతనికి బంగ్లాతో ఆడే అవకాశం కల్పించారు. 

More Telugu News