: నటిని కావాలన్న నా కల నెరవేరింది కానీ, ఆ రోజులే మిస్సవుతున్నాను: జాక్వెలిన్ ఫెర్నాండెజ్

నటిని కావాలన్న తన కల నెరవేరింది కానీ, ‘రిపోర్టర్’గా పని చేసిన ఆ రోజులను మాత్రం మిస్సవుతున్నానని బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చెప్పింది. శ్రీలంకలో పుట్టి పెరిగిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసి, జర్నలిజంలోకి ప్రవేశించి అక్కడే రిపోర్టర్ గా పని చేసింది. తాజా వార్తలు తెలుసుకుని సేకరించడం, వాటిని రాయడమంటే సాహసంతో కూడుకున్నదే అని అభిప్రాయపడింది. రిపోర్టర్ గా ఒక బృందంలో పని చేయడం, డిటెక్టివ్ పనిలా ఉంటుందని జాక్వెలిన్ అభిప్రాయపడింది. కాగా, ‘జుడ్వా-2’, ‘రీ లోడ్’ చిత్రాలతో పాటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న మరో చిత్రంలో జాక్వెలిన్ ప్రస్తుతం నటిస్తోంది.
 

More Telugu News