: తనకు విషం పెడుతున్నారేమోనని జయలలిత చెప్పేవారు: అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్య

తన ఇంట్లోనే తనకు నెమ్మదిగా విషం పెడుతున్నట్టు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన వద్ద భయాన్ని, ఆందోళనను వ్యక్తం చేశారని అన్నాడీఎంకే నేత పీహెచ్ పాండియన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన కుమారుడు మాజీ ఎంపీ మనోజ్ పాండియన్ తో కలసి ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, తనకు విషం పెడుతున్న విషయాన్ని ఆమే స్వయంగా చెప్పారని అన్నారు. శశికళను పార్టీ కార్యదర్శిగా, తమిళనాడు సీఎంగా ఎవరూ అంగీకరించే పరిస్థితి లేదని తెలిపారు. జయలలిత, ఎంజీ రామచంద్రన్ ఆశీర్వాదాలు శశికళపై లేవు కాబట్టే, ఆమె ప్రమాణ స్వీకారం చేయలేకపోయారని పాండియన్ తెలియజేశారు.

More Telugu News