: పెళ్లినాటి నీలమణి ఆభరణాల వస్త్రాన్ని ధరించిన బ్రిటన్ రాణి... వైభవంగా సఫైర్ జూబ్లీ

ప్రస్తుతం 90 ఏళ్ల వయసులో ఉన్న బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అరుదైన రికార్డు సృష్టించారు. బ్రిటన్ రాణిగా 65 సంవత్సరాల పాటు సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళగా నిలిచారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 1947లో కింగ్ జార్జ్-6తో వివాహం సందర్భంగా ఆమె ధరించిన నీలమణి వస్త్రాన్ని తిరిగి ధరించగా, ఆ ఫోటోను బకింహాం ప్యాలెస్ విడుదల చేసింది. ఇక 65 ఏళ్ల పాలన సందర్భంగా సఫైర్ జూబ్లీ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్యాలెస్ వద్ద ఉన్న గ్రీన్ పార్కులో 41 తుపాకులు పేల్చి, లండన్ టవర్ వద్ద 62 తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించనున్నారు. సఫైర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక నాణాలను తయారు చేసి విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

More Telugu News