: అరె, సెహ్వాగ్! కొద్దిసేపు ఆగి ఉంటే ఈ ఫొటోను ఉపయోగించుకునే వాడివిగా!: సచిన్

‘అరె, సెహ్వాగ్! కొద్దిసేపు ఆగి ఉంటే ఈ ఫొటో ఉపయోగించుకునే వాడివిగా’ అంటూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇంతకీ, ఈ వ్యాఖ్యలు సచిన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. ఈ నెల 4వ తేదీన వీరేంద్ర సెహ్వాగ్ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘ఢిల్లీలో దేవుడి దర్శనం’ అంటూ సచిన్ ను కలిసిన ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ట్వీట్ కు స్పందించిన సచిన్, అంతకంటే మెరుగైన ఫొటోను పోస్ట్ చేసి, కొంచెం సేపు ఆగి ఉంటే ఈ ఫొటోను ఉపయోగించుకునే వాడివని, తనను కలవడం ఎప్పుడూ సంతోషమేనని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అందుకు, స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్, నవ్వుతూ, ఎప్పటి లాగే మళ్లీ తొందరపడ్డానని, మిమ్మల్ని ఎవ్వరు, ఎప్పుడు కలిసినా సంతోషం కలుగుతుంది అని పేర్కొన్నాడు.

More Telugu News