: కూతురు జీవా రెండవ జన్మదినాన్ని ప్రత్యేకంగా హిల్‌ స్టేషన్‌లో జరుపుకున్న ధోనీ

ఇంగ్లండ్‌తో టీమిండియా సిరీస్ ముగియ‌డంతో మహేంద్రసింగ్‌ ధోనికి కాస్త ఖాళీ స‌మ‌యం దొరికింది. దీంతో ఆయ‌న తన కుటుంబ సభ్యులతో హ్యాపీగా గ‌డుపుతున్నాడు. త‌న‌ కూతురు జీవా ఈ రోజు రెండవ‌ పుట్టిన రోజు జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ధోనీ తన భార్య సాక్షి స‌హా స్నేహితులతో కలిసి ఉత్తరాఖండ్ లోని ముస్సోరికి వెళ్లాడు. అక్క‌డే త‌న చిట్టి కూతురి పుట్టిన‌రోజు వేడుక‌ని సింపుల్ గా జ‌రుపుకుంటున్నాడు. ధోని తండ్రి పాన్‌సింగ్‌ ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన వార‌న్న విష‌యం తెలిసిందే. 

More Telugu News