: బడ్జెట్ కసరత్తు ప్రారంభించాం: సీఎం చంద్రబాబు

ఏపీ బడ్జెట్ కు కసరత్తు ప్రారంభించామని, అన్ని శాఖలతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ మాట్లాడారని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో శాఖాధిపతులు, కార్యదర్శులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులూ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలపై సమీక్ష, బడ్జెట్ పై కసరత్తు, నిధుల వినియోగంపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జీఎస్టీ వల్ల రాబోయే రోజుల్లో రెవెన్యూ పెరుగుతుందని, క్రమంగా ఆన్ లైన్ లావాదేవీల దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని, సమస్యలు ఉన్నా, రెండంకెల వృద్ధి సాధించామని, సామాన్యుడు సంతృప్తి స్థాయిని అందుకోవడమే ముఖ్యమని చంద్రబాబు అన్నారు.

More Telugu News