: శత్రువులకన్నా టీడీపీలో ఉన్న మిత్రుల వల్లే ఎక్కువ నష్టం: టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల
టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంస్థాగత ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన టీడీపీ గుంటూరు నగర సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శత్రువులకన్నా టీడీపీలో ఉన్న మిత్రులతోనే ఎక్కువ నష్టమని ఆయన అన్నారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో సైతం సింహంలా పని చేశానని... ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత సొంత పార్టీవారే తనను సున్నా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో ఇతరుల జోక్యం ఎక్కువైపోయిందని... పనులు, పార్టీ పదవులు తన ప్రమేయం లేకుండానే కొనసాగుతున్నాయని విమర్శించారు. పేదలు, కార్యకర్తల కోసం తాను చేసిన సిఫారసులను అధికారులు కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.