: వరుడు పరిగెత్తుతుంటే, ఫినిష్ లైన్ వద్ద వేచి చూసిన వధువు... అక్కడే పెళ్లి కూడా!

ఇండియాలో పెళ్లి అంటే జరిగే హంగు, ఆర్భాటాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇదే సమయంలో కొన్ని వివాహాలు సాదాసీదాగా, మరికొన్ని వినూత్నంగా జరుగుతూ ఉంటాయి. అటువంటిదే ఈ పెళ్లి కూడా. తాను ఇష్టపడిన అమ్మాయిని వైవిధ్యంగా వివాహం చేసుకున్నాడో యువకుడు. జైపూర్ హాఫ్ మారథాన్ జరుగుతున్న వేళ, అందులో పాల్గొన్న 31 సంవత్సరాల ఇంజనీర్ అనంత్ త్రివేది, పోటీ ఫినిష్ లైన్ ను చేరుకుని అక్కడే వేచి చూస్తున్న తన ప్రియురాలు కవితా బాత్రా (28)ను పెళ్లి చేసుకున్నాడు.

 గత మూడేళ్లుగా ప్రేమిస్తున్న కవితను వివాహం చేసుకోవడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని, పరుగు తీయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చన్న సందేశాన్ని సమాజానికి అందించాలన్న ఉద్దేశంతో మారథాన్ ఫినిష్ లైన్ నే వివాహ వేదికగా ఎంచుకున్నట్టు తెలిపారు. కాగా, మారథాన్ పోటీని నటి కంగనా రౌనత్ ప్రారంభించగా, కొత్త జంటకు అభినందనలు తెలిపేందుకు పలువురు పోటీ పడ్డారు.

More Telugu News