: నేను సీఎం పదవిని చేపట్టాలని పన్నీర్ సెల్వం కోరారు: శశికళ
తనను సీఎం పదవి చేపట్టాలని పన్నీర్ సెల్వం కోరారని అన్నాడీఎంకే శాసనసభాపక్ష కొత్త నేత శశికళ అన్నారు. మొదట పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టమని కోరింది కూడా పన్నీర్ సెల్వమేనని అన్నారు. ఈ పదవికి తనను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ‘అమ్మ’ జయలలిత ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని అన్నారు.
అన్నా డీఎంకే శాసనసభా పక్ష నేతగా శశికళ ఎన్నికైన విషయాన్ని పన్నీర్ సెల్వం ఆమెకు తెలియజేశారు. కాగా, తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి రాగానే అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నుకున్న తీర్మానాన్ని అందజేయనున్నారు. శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మంచి ముహూర్తాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.