: అంతకన్నా అసహ్యం ఇంకోటి ఉండదు: శశికళపై స్పందించిన స్వామి

తమిళనాడు ముఖ్యమంత్రిగా వీకే శశికళ ప్రమాణ స్వీకారం చేస్తే, రాష్ట్రానికి అంతకన్నా అసహ్యకరమైనది మరొకటి ఉండదని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు. "శశికళ సీఎంగా అవకుండా చేయడానికి ఎలాంటి నిషేధమూ లేదు. అయితే, ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి. ఆమెపై సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసు విచారణలో ఉంది. ఓ నిందితురాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమేంటి? రాష్ట్రానికి మళ్లీ ఎన్నికలు వచ్చేలోగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో పదవిని చేపట్టడం రాష్ట్రానికి మంచిది కాదు" అని ఆయన అన్నారు. కాగా, నేడు అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుండగా, శాసనసభా పక్ష నేతగా శశికళను ఎన్నుకోవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

More Telugu News