: బంపర్ ఆఫర్ తో జియోను ఢీకొట్టడానికి సిద్ధమైన బీఎస్ఎన్ఎల్

రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత టెలికాం సంస్థల మధ్య ప్రత్యక్ష యుద్ధమే జరుగుతోంది. జియో ప్రభంజనాన్ని తట్టుకునేందుకు ఇతర టెలికాం సంస్థలన్నీ తమ ట్యారిఫ్ లను, ప్లాన్ లను సమూలంగా మార్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. 3జీ మొబైల్ ఇంటర్నెట్ ఛార్జీలను నాలుగు రెట్లు తగ్గించింది. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 36కే 1జీబీ డేటాను అందిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, రూ. 291 ప్లాన్ కింద 8జీబీ డేటాను అందిస్తోంది. గతంలో ఈ ప్లాన్ కింద 2జీబీ డేటా మాత్రమే లభించేది. ప్రస్తుతానికి టెలికాం ఇండస్ట్రీలో ఇంతకన్నా తక్కువ ధరకు ఏ ఇతర కంపెనీ డేటాను అందించడం లేదు. అయితే, ఈ డేటాను 28 రోజుల్లోనే వినియోగించుకోవాల్సి ఉంటుంది. 

More Telugu News