: చంద్రగిరి బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

చిత్తూరు జిల్లా చంద్రగిరి బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. మృతులను బెంగళూరుకు చెందిన విజయభాస్కర్, నెల్లూరుకు చెందిన జనార్దన స్వామిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News