: ఈ ఫోన్ ను వేడినీళ్లతోను, సబ్బుతోనూ కూడా కడగొచ్చు!

క్యోసెరా సంస్థకు చెందిన రాఫ్రె కేవైవీ 40 స్మార్ట్ ఫోన్ మార్చి నెలలో అందుబాటులోకి రానుంది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.25,660గా ఉంది. ఇక ఈ ‘రాఫ్రె కేవైవీ 40’ ప్రత్యేకతల విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ ను సబ్బు, వేడి నీటితో కడగొచ్చని, ప్రపంచంలోనే ఇలాంటి ఫీచర్ కలిగిన మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఫోన్ ఇదేనని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. షాక్ ఫ్రూప్ టెక్నాలజీతో దీనిని రూపొందించారు.

5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 1280x720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, డ్రాగన్ టెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, అడ్రినో 505 గ్రాఫిక్ప్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 200 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 1.4 గిగా హెడ్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, ఎల్ ఈడీ ప్లాష్ తో 13 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 2 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా మొదలైన ప్రత్యేకతలతో ఈ స్మార్ట్ ఫోన్ ను తయారు చేశారు.  

More Telugu News