: టీమిండియాపై ప్రశంసలు కురిపించిన కేసీఆర్

ఇంగ్లండ్ తో జరిగిన టీ20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో, ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారత జట్టుకు అభినందనలు తెలియజేశారు. వన్డే, టెస్ట్, టీ20 సిరీస్ లను కైవసం చేసుకోవడంతో... భారత జట్టు అన్ని ఫార్మాట్లలోనూ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుందని ఆయన కొనియాడారు. రానున్న రోజుల్లో టీమిండియా మరిన్ని ఘన విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.


More Telugu News