: ఇంగ్లండ్ దిగ్గజం గ్రేమ్ స్వాన్ అత్యుత్తమ జట్టు ఇదే...సచిన్ కు స్థానం

అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన అనంతరం క్రికెటర్లు కలల జట్టును తయారు చేయడం సాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు తమ సమకాలీనులతో అంతర్జాతీయ అత్యుత్తమ జట్టు అంటూ ఒక జట్టును తయారు చేయడం, అందులో దిగ్గజాలకు స్థానం కల్పించడం విశేషం. ఈ క్రమంలో ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు గ్రేమ్ స్వాన్ తన కలల జట్టును ప్రకటించాడు. ఆ జట్టులో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్ కు స్థానం కల్పించడం విశేషం. స్వదేశీయులైనా, విదేశీయులైనా కలల జట్టులో సచిన్ కు స్థానం ఖాయంగా మారింది. కాగా, స్వాన్ జట్టు వివరాల్లోకి వెళ్తే...

డాన్ బ్రాడ్ మన్, ఆడమ్ గిల్ క్రిస్ట్, గ్లెన్ మెక్ గ్రాత్, జాక్ హాబ్స్, గ్రేమ్ స్వాన్, జేమ్స్ ఆండర్సన్, గ్రీనిడ్జ్, గ్యారీ సోబర్స్, బ్రయాన్ లారా, సచిన్ టెండూల్కర్, వసీం అక్రమ్ లను ఎంపిక చేశాడు. ఈ జట్టులో 12వ ఆటగాడిగా తమ దేశానికి చెందిన జేమ్స్ ఆండర్సన్ ను పేర్కొన్నాడు. 

More Telugu News