: దాసరి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా: జగన్

హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ రోజు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన జగన్... దాసరిని కలిశారు. ఆ తర్వాత ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దాసరి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ వెంట పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో పాటు పలువురు నేతలున్నారు. 

More Telugu News