: హత్యకు గురైన టెక్కీ రశీలా కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇచ్చేందుకు ఒప్పుకున్న ఇన్ఫోసిస్

ఆదివారం నాడు పుణెలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో ఒంటరిగా పనిచేస్తూ, హత్యకు గురైన కేరళ యువతి రశీలా రాజు కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియాతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ఇన్ఫోసిస్ యాజమాన్యం అంగీకరించింది. తనకు సహకరించలేదని రశీలా గొంతుకు నెట్ వర్కింగ్ కేబుల్ ను చుట్టి సెక్యూరిటీ గార్డే హత్య చేశాడని పోలీసులు తేల్చిన సంగతి తెలిసిందే. ఇక ఆమె అంత్యక్రియలు నిన్న కేరళలోని స్వగ్రామంలో వందలాది మంది అశ్రునయనాల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా ఆమె తండ్రి మాట్లాడుతూ, తన బిడ్డకు కార్యాలయంలో వేధింపులు ఎదురయ్యాయని, ఒంటరిగా ఆఫీసుకు పిలిపించి హత్యను చేయించారని ఆరోపించారు.

More Telugu News