cricket: బీసీసీఐకి పాలకమండలి సభ్యులను నియమించిన సుప్రీంకోర్టు

మాజీ 'కాగ్' వినోద్ రాయ్ నేతృత్వంలో బీసీసీఐకి నలుగురు సభ్యులతో కూడిన పాలకమండలిని సుప్రీంకోర్టు ఈ రోజు నియ‌మించింది. వినోద్‌రాయ్‌తో పాటు చరిత్రకారుడు రామచంద్ర గుహ, విక్రమ్‌ లిమాయే, మాజీ క్రికెటర్‌ డియానా ఎదుల్జీ ఇందులో స‌భ్యులుగా ఉండ‌నున్నారు. ఈ కమిటీలో టీమిండియా మాజీ క్రికెటర్లకు కానీ, బోర్డు మాజీ అధికారులకు కానీ చోటు ద‌క్క‌లేదు. ఈ కమిటీలో కేంద్ర క్రీడల శాఖ మంత్రిని సభ్యుడిగా నియమించాలంటూ కేంద్ర స‌ర్కారు చేసిన‌ విన్నపాన్ని న్యాయ‌స్థానం తిరస్కరించింది. బీసీసీఐలో సంస్క‌ర‌ణ‌ల కోసం ఏర్పాటు చేసిన‌ లోధా క‌మిటీ ప‌లు సిఫార‌సులు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బోర్డు వ్య‌వ‌హారాల‌ను చూసే బాధ్య‌త‌ను ఈ క‌మిటీకి అప్ప‌గించింది.

More Telugu News