demonitization: నకిలీ రూ.500 నోట్ల కలకలం

గోవాలో నకిలీ రూ. 500 నోట్ల క‌ల‌క‌లం చెల‌రేగింది. అక్క‌డి ఓ రెస్టారెంట్లో బ‌స చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ ఓ ముఠా హోట‌ల్ బిల్లును చెల్లించే క్ర‌మంలో ఒరిజిన‌ల్ 500 రూపాయ‌ల నోట్ల మ‌ధ్య‌లో న‌కిలీ నోట్ల‌ను ఇచ్చారు. అయితే, ఆ నోట్ల‌ను ప‌రిశీలించిన హోట‌ల్ య‌జ‌మాని వెంట‌నే పోలీసులకు ఈ విష‌యాన్ని తెలిపాడు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఏపీకి చెందిన సదరు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులను వేట కమలాకర్, దుగ్గు కుమార్, దేవిశెట్టి నరసింహారావు, టిట్టెట్టి నాగూరయ్య, పల్లికొండ ప్రతాప్, గొల్లా యాదవ్ గా గుర్తించామని పోలీసులు తెలిపారు. వారిని రెండు రోజుల పోలీస్ క‌స్ట‌డీ త‌రువాత బెయిల్‌పై విడుద‌ల చేసిన పోలీసులు త‌మ‌ విచారణలో ఆ న‌కిలీ నోట్ల మూలాల గురించి ఎలాంటి విషయాలు వెల్లడికాలేదని తెలిపారు.

More Telugu News