: తూర్పుగోదావరి జిల్లా తునిలో భారీ అగ్నిప్రమాదం.. అపార్ట్మెంట్ నుంచి ఎగసిపడుతున్న మంటలు
తూర్పుగోదావరి జిల్లా తునిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుర్గాదాస్ వీధిలోని ఓ అపార్ట్మెంట్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన నివాసితులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఇంకా ఎగసిపడుతూనే ఉన్నాయి. పోలీసులు అపార్ట్మెంట్కు చేరుకుని అందులోని వారిన ఖాళీ చేయిస్తున్నారు. పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. ఆస్తి, ప్రాణ నష్టంపై ఇప్పటి వరకు సమాచారం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.