: ఢిల్లీలో ఘనంగా బీటింగ్ రిట్రీట్

ఢిల్లీలో రిపబ్లిక్ డే ముగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. త్రివిధ దళాల అధిపతి రాష్ట్రపతి సైనిక దళాల వందనం అందుకోవడంతో బీటింగ్ రిట్రీట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఎర్రకోట ముందు జరిగిన ఈ కార్యక్రమంలో త్రివిధ దళాలకు చెందిన బ్యాండ్స్ లయబద్ధంగా వాయిద్యాలను వాయిస్తూ క్రమశిక్షణ చాటుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. 

More Telugu News