special status: 'పందుల పందేలు' నిర్వహించుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారని సుజనా చౌదరిపై పోలీసులకు ఫిర్యాదు

ప్ర‌త్యేక హోదా కోసం ఆంధ్ర‌యువ‌త పోరాటానికి సిద్ధ‌మైన నేప‌థ్యంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రం తెలుపుతూ  కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. హోదా పోరాటాన్ని కించపరిచేలా కోళ్లు, పందుల పందేలు నిర్వహించుకోవాలంటూ ఆయ‌న అనుచిత వ్యాఖ్య‌లు చేశారని పేర్కొన్నారు. సుజనా చౌదరిని అరెస్టు చేయాలని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌ అనేక నిర్బంధాలను ఎదుర్కొని ఆందోళ‌న‌లో పాల్గొంటే స‌ర్కారులో కొంచెం కూడా స్పంద‌న లేద‌ని జోగి ర‌మేష్ అన్నారు.

More Telugu News