devineni uma: జగన్ కనుక నిన్న ఢిల్లీలో ఉండి ఉంటే .. తానే ప్రధానిని అనేవారేమో!: మంత్రి దేవినేని ఎద్దేవా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తూ నిర‌స‌న‌లో పాల్గొన‌డానికి నిన్న‌ విశాఖ‌ప‌ట్నానికి వెళ్లిన వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అక్క‌డి ఎయిర్‌పోర్టులో పోలీసుల‌పై మండిప‌డుతూ 'సీఎంతో పెట్టుకుంటున్నా'రంటూ ప‌లు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాను సీఎం కాగానే అంద‌రి సంగ‌తి చూస్తాన‌ని జ‌గ‌న్ ఆ సంద‌ర్భంగా అన్నారు. జ‌గ‌న్ చేసిన ఆ వ్యాఖ్య‌ల‌పై మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఆయ‌న‌కు పారనోయ వ్యాధి వ‌చ్చింద‌ని, ఆ వ్యాధి ఉన్నవారు తమను తాము అతిగా ఊహించుకుంటారని ఆయ‌న అన్నారు. ఆ వ్యాధి ఉన్నవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక‌వేళ‌ జగన్‌ నిన్న ఢిల్లీలో ఉండి ఉంటే క‌నుక‌ తానే ప్రధానిని అనేవారేమో అని ఆయ‌న ఎద్దేవా చేశారు.

More Telugu News