venkaiah naidu: ఇబ్బందులు ఉన్నా చంద్ర‌బాబు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశ‌గా నడిపిస్తున్నారు!: వెంక‌య్య నాయుడు

విశాఖ‌ప‌ట్నంలో ప్రారంభ‌మైన సీఐఐ భాగ‌స్వామ్య‌ స‌ద‌స్సు కొన‌సాగుతోంది. విశాఖ‌లో రెండోసారి ఈ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌ద‌స్సు ఫ‌లితంగా రూ.8 ల‌క్ష‌ల కోట్ల ఎంవోయూలు కుదురుతాయ‌ని అంచ‌నా. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు మాట్లాడుతూ... చంద్ర‌బాబు కార‌ణంగానే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి దిశ‌గా ముందుకు వెళుతోందని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పై కేంద్ర ప్రభుత్వం ప్ర‌త్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం ఎన్నో ప్రాజెక్టులు, విద్యా సంస్థ‌లు, జాతీయ ర‌హ‌దారులు ఇచ్చిందని అన్నారు.

అభివృద్ధి విష‌యంలో రాష్ట్రాల మ‌ధ్య పోటీ నెల‌కొందని వెంకయ్య నాయుడు చెప్పారు. ప్ర‌పంచం మొత్తం భార‌త్‌వైపు చూస్తోందని చెప్పారు. దేశంలో బ‌ల‌మైన నాయ‌కుడు, స్థిర‌మైన ప్ర‌భుత్వం వున్నారని అన్నారు. ఎన్నో స‌మ‌స్య‌ల‌కు పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం ప‌రిష్కారం చూపిందని, గృహ‌రుణాల‌పై వ‌డ్డీ రేట్లు దిగివ‌చ్చాయని తెలిపారు. దేశంలో పెట్టుబ‌డుల అవ‌కాశాలు పెరిగాయని అన్నారు. అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసి ప‌నిచేయాలని పిలుపునిచ్చారు. విభ‌జ‌న ఇబ్బందులు ఉన్నా చంద్ర‌బాబు ఎంతో చ‌క్క‌గా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశ‌గా ముందుకు న‌డిపిస్తున్నారని తెలిపారు.

More Telugu News