: అందుకే తెలుగుదేశం, బీజేపీకి నేను సపోర్ట్ చేశాను!: పవన్ కల్యాణ్

గత ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమికి తాను ఎందుకు మద్దతిచ్చానన్న కారణాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వివరించారు. "అప్పటికి పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండి, సమస్యలను తాత్సారం చేసినందుకు... కొత్తగా ఒకరు ప్రధానమంత్రి అవుతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన సమస్యలను అర్థం చేసుకుంటారు. అలాగే పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. జరిగిన అనుభవాల నుంచి వారు పాఠాలు నేర్చుకోని ఉంటారని అనుకున్నాను. అందుకే మద్దతిచ్చాను. ఆ రోజున నాకు వీలైనంత సాయం చేశాను. వారి జెండాను నేను మోశాను. నాతో పాటు నన్ను నమ్మినవారందరూ, నన్ను ఫాలో అయిన వారందరూ మోశారు. కానీ వాళ్లు ఏదైతే మాటిచ్చారో, దాన్ని తప్పారు" అని నిప్పులు చెరిగారు.

More Telugu News