: క‌విత కాళ్ల వ‌ద్ద కూర్చుని ముచ్చ‌టిస్తున్న ఐఏఎస్‌.. విస్తుపోయిన ప్ర‌జ‌లు!

గ‌ణతంత్ర దినోత్స‌వ వేళ ఓ ఐఏఎస్ అధికారి ఏకంగా నిజామాబాద్ ఎంపీ, ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత పాదాల చెంత కూర్చుని ముచ్చ‌టించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఐఏఎస్ ముష్రఫ్ అలీ వ్య‌వ‌హ‌రించిన తీరుపై స‌ర్వ‌త్ర విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రోవైపు జ‌గిత్యాల జిల్లాలోని చారిత్ర‌క ఖిల్లాలో గురువారం నిర్వ‌హించిన వేడుక‌ల్లో క‌లెక్ట‌ర్ శ‌ర‌త్ మాట్లాడుతూ త‌న‌కు ఈ అవ‌కాశం క‌ల్పించిన సీఎం కేసీఆర్‌కు పాదాభివంద‌నం చేస్తున్నానంటూ పేర్కొన‌డంతో హాజ‌రైన ప్ర‌ముఖులు అవాక్క‌య్యారు. క‌లెక్ట‌ర్లు ఇలా రాజ‌కీయ నాయ‌కుల్లా మారిపోయి అఖిల భార‌త స‌ర్వీసుల‌కు త‌ల‌వంపులు తీసుకొచ్చారంటూ ప‌లువురు ప్ర‌ముఖులు, ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు సంధిస్తున్నాయి. క‌విత కాళ్ల వ‌ద్ద కూర్చుని ముచ్చ‌టిస్తున్న ముష్రఫ్ అలీ ఐఏఎస్ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. క‌లెక్ట‌ర్ తీరుపై నెటిజ‌న్లు మండిప‌డుతూ కామెంట్లు చేస్తున్నారు.
http://images.deccanchronicle.com/dc-Cover-1kahidj09r61966u619hvntk03-20170127022821.Medi.jpeg

More Telugu News