cricket: కెప్టెన్ గా కోహ్లీ తొలి టీ20 మ్యాచులో చెప్పింది చెప్పినట్లే చేశాడు!

కాన్పూర్ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్‌ల మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టీ20 మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకున్న విష‌యం తెలిసిందే. టీమిండియా ఓపెన‌ర్లుగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, లోకేశ్‌ రాహుల్ క్రీజులోకి వ‌చ్చారు. ఇటీవ‌లే కెప్టెన్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... తాను ఓపెనింగ్‌కు దిగే అవకాశాలున్నాయని చెప్పిన సంగ‌తి విదిత‌మే. ఆయ‌న‌కు కెప్టెన్‌గా ఇదే తొలి టీ20 మ్యాచు. ఈ మ్యాచులోనే ఆయ‌న ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగాడు. తొలి ఓవర్‌ లో మూడో బంతిని బౌండరీకి పంపి కోహ్లీ త‌న ప‌రుగుల ఖాతాను ప్రారంభించాడు. అయితే, 8 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద రాహుల్ అవుట‌య్యాడు. అనంత‌రం క్రీజులోకి రైనా వ‌చ్చాడు. ప్ర‌స్తుతం కోహ్లీ 26, రైనా 10 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

More Telugu News