special status: వారు పోలీసులో.. టీడీపీ గుండాలో తెలియదు.. ఎయిర్‌పోర్టులో మ‌మ్మ‌ల్ని అడ్డ‌గించారు!: అంబ‌టి రాంబాబు

ఆంధ్రప్రదేశ్ కి ప్ర‌త్యేక హోదా కోసం విశాఖప‌ట్నంలో ఈ రోజు సాయంత్రం నిర్వ‌హించత‌ల‌పెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన‌డానికి హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్‌పోర్టుకి చేరుకున్న నేప‌థ్యంలో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌మ పార్టీ నాయ‌కుల‌తో ఎయిర్‌పోర్టులోనే బైఠాయించిన నేప‌థ్యంలో ఆ పార్టీ నేత‌ అంబ‌టి రాంబాబు టీడీపీ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మఫ్టీలో ఉన్న వ్యక్తులు త‌మ‌ని అడ్డగించారని వ్యాఖ్యానించారు. వారిని అడ్డ‌గించిన వారు పోలీసులో.. టీడీపీ గూండాలో తెలీదని అన్నారు. వారికి ఐడెంటిటీ కార్డులు కూడా లేవని అన్నారు.

More Telugu News