selfie: సెల్ఫీ మోజులో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ తార్నాక నారాయణ కాలేజీ విద్యార్థులు

సెల్ఫీలపై ఉన్న మోజు మ‌రో ఇద్ద‌రు విద్యార్థుల ప్రాణాలు తీసింది. ప్ర‌మాదక‌ర ప్ర‌దేశాల్లో సెల్ఫీలు తీసుకుంటూ మృతి చెందార‌న్న వార్త‌లు ప్ర‌తిరోజు వ‌స్తూనే ఉన్న‌ప్ప‌టికీ యువ‌త ఆ మోజులోంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతోంది. సెల్ఫీ సరదాకు మ‌రో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో చోటుచేసుకుంది. హైదరాబాద్‌, తార్నాకలోని నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫ‌స్టియ‌ర్ విద్యార్థులు అవినాష్‌(16), చరణ్‌(16), భరత్‌(17) వంశీ(16) ఈ రోజు వరంగల్‌ జాతీయ రహదారి ఘట్‌కేసర్‌ సమీపంలోని సత్యపాల్‌ క్రషర్‌మిషన్‌ వద్ద ఉన్న నీటి గుంత వద్దకు చేరుకొని అక్క‌డ సెల్ఫీలు తీసుకునే ప్ర‌య‌త్నం చేశారు. వారిలో అవినాష్‌, చరణ్‌లు సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి ఇద్దరూ నీటికుంటలో పడిపోయారు. త‌మ మిత్రుల‌ను ర‌క్షించ‌డానికి మిగ‌తా ఇద్ద‌రు విద్యార్థులు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఈ ఘ‌ట‌న‌పై ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News