: పద్మ అవార్డులకు రికమండేషన్ కావాలా?: షట్లర్ గుత్తా జ్వాల

గత 15 ఏళ్లుగా దేశం కోసం ఆడుతున్నానని... ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో సత్తా చాటానని... అయినప్పటికీ తనను పద్మ పురస్కారానికి ఎంపిక చేయలేదని ప్రముఖ షట్లర్ గుత్తా జ్వాల ఆవేదన వ్యక్తం చేసింది. పద్మ పురస్కారం కోసం ఇప్పటికే మూడు సార్లు దరఖాస్తు చేశానని... అయినా కావాలనే తనను విస్మరించారని ఆరోపించింది. అన్ని అర్హతలు ఉన్నాయన్న భావనతోనే పద్మ అవార్డులకు దరఖాస్తు చేశానని... కానీ అవి వారికి సరిపోలేదని చెప్పింది.

 పద్మ అవార్డులు రావాలంటే రికమెండేషన్ కావాలని తెలిపింది. రెకమెండేషన్ ఉంటేనే అవార్డుకు ఎంపిక చేస్తామనేటప్పుడు... దరఖాస్తులను ఎందుకు ఆహ్వానించాలని ప్రశ్నించింది. తాను సాధించిన విజయాలు పద్మ పురస్కారానికి సరిపోవా? అని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళల డబుల్స్ లో తాను అందరికీ మార్గదర్శకంగా నిలిచానని చెప్పింది. తాను ముక్కుసూటిగా ఉండటం వల్లే తనకు అవార్డును నిరాకరిస్తున్నారని ఫేస్ బుక్ లో తెలిపింది.

More Telugu News