: ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో...!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు అమరావతిలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలకు ఆమోదముద్ర వేసింది.
* గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఆంధ్రప్రదేశ్లో వినోదపన్ను మినహాయింపు
* కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు 638 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయం
* అనంతపురం జిల్లాలో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు 4018 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం
* పోలవరం సబ్ కాంట్రాక్టర్ అయిన ఎల్అండ్టీ కంపెనీకి రూ.95 కోట్లను ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లించేందుకు ఆమోదముద్ర
* ఏపీ అసెంబ్లీ భవన ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని నిర్ణయం.