kohli: రెండు సార్లు మాత్రమే ఓపెనింగ్‌ చేశా.. ఇంగ్లండ్‌తో జరిగే టీ20ల్లోనూ చేస్తా: విరాట్ కోహ్లీ

ఇంగ్లండ్ టీమ్ భారత ప‌ర్య‌ట‌న‌లో భాగంగా టీమిండియాతో రేప‌టి నుంచి టీ20 మ్యాచులు ఆడ‌నుంది. ఈ సంద‌ర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... రేప‌టి నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచుల్లో టీమిండియాలో పెద్ద‌గా మార్పులు ఉండ‌వ‌ని తెలిపాడు. జ‌ట్టులో నిలకడ లేనప్పుడే సమస్యలు వస్తాయని, తాను అవసరమైతే ఓపెనర్‌గా బ్యాటింగ్ చేస్తాన‌ని చెప్పాడు. బ్యాటింగ్ లైన‌ప్‌లో టీమిండియాకు ఎన్నో ప్ర‌త్యామ్నాయాలున్నాయ‌ని, తాను ఇప్ప‌టికి రెండు సార్లు మాత్రమే ఓపెనింగ్‌ చేశానని చెప్పాడు. టీమిండియా టెస్టులు, వన్డేల్లో మంచి ఫ‌లితాల‌ను సాధిస్తోంద‌ని, టీ20ల్లోనూ అదే ఆట‌తీరును క‌న‌బ‌రుస్తామ‌ని చెప్పాడు.  సీనియర్స్‌, జూనియర్స్‌ ఉండటంతో టీమిండియాలో తుది జట్టులో స్థానం కోసం పోటీ అధికంగానే ఉంద‌ని తెలిపాడు.

More Telugu News