: మంత్రి రావెలపై మండిపడ్డ చంద్రబాబు!

టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో మంత్రి రావెల కిషోర్ బాబు పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ తో వివాదం, నియోజకవర్గం నుంచి రావెలపై వస్తున్న ఫిర్యాదులను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. వివాదాలతో పార్టీకి నష్టం చేస్తున్నారని, పార్టీలోకి కొత్తగా వచ్చినా అవకాశం దక్కిందన్న విషయాన్ని మర్చిపోతే ఎలా? అంటూ   మండిపడ్డారు. వివాదాలతో పార్టీని ఇబ్బంది పెడితే సహించేది లేదని రావెలను చంద్రబాబు ఘాటుగా హెచ్చరించినట్లు సమాచారం.

More Telugu News