: ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోంది: కాల్వ శ్రీనివాసులు

ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. ముప్ఫై నెలల్లో ఎన్నో సంస్థలు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో ముందుకు వెళ్తున్నామని, ఈ విషయంలో ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంటుందని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి జగన్ ముందు నుంచి అడ్డుపడుతున్నారని, ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంటుందని ఆయన గ్రహించాలని, యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలను జగన్ మానుకోవాలని ఆయన హితవు పలికారు. రిపబ్లిక్ డే రోజున ముప్పు ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయని, ఈ సందర్భంలో నిరసన కార్యక్రమాలు సరికాదని కాల్వ శ్రీనివాసులు అన్నారు.

More Telugu News