nagarjuna: ఇటువంటి సినిమాల‌కు న‌న్నే ఎందుకు ఎంచుకుంటార‌ని నేను రాఘ‌వేంద్ర‌రావుని అడ‌గ‌లేదు: నాగార్జున

న‌టుడు అక్కినేని నాగార్జున, ద‌ర్శ‌కుడు రాఘవేంద్రరావుల కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మ‌రో భక్తి సినిమా 'ఓం న‌మో వేంక‌టేశాయ'. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో నాగ్ మాట్లాడుతూ.. ఇటువంటి సినిమాల్లో న‌టించ‌డం ప్ర‌త్యేక అనుభూతినిస్తోంద‌ని చెప్పారు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయి, ఓం నమో వేంకటేశాయ.. ఇలా అన్ని సినిమాల్లో తానే ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించాల‌ని రాఘ‌వేంద్ర‌రావే త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి అడిగారని నాగార్జున చెప్పారు. ఇటువంటి సినిమాల‌కు త‌న‌నే ఎందుకు ఎంచుకుంటార‌ని తాను రాఘ‌వేంద్ర‌రావుని ఎన్న‌డూ అడ‌గ‌లేదని ఆయ‌న పేర్కొన్నారు. ఆయ‌న త‌న‌నే ఎంపిక చేసుకుంటున్నందుకు తాను ల‌క్కీగా ఫీల్ అవుతానని అన్నారు. ఇటువంటి కొత్త కొత్త క్యారెక్ట‌ర్లు వ‌చ్చిన‌ప్పుడు తాను గ‌ర్వంగానే భావిస్తాన‌ని, ఇటువంటి క్యారెక్ట‌ర్లు చేయ‌డంతో ఓ ప్ర‌త్యేక అనుభూతిని పొందుతున్నాన‌ని అన్నారు.

More Telugu News