: తమిళనాడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన డీఎంకే, కాంగ్రెస్

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు సభలో ప్రసంగించారు. అనంతరం డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ సందర్భంగా డీఎంకీ సభ్యులు మాట్లాడుతూ, జల్లికట్టు కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ప్రజలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు బాగాలేదని మండిపడ్డారు. మరోవైపు, జల్లికట్టు బిల్లును నేడు తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. 

More Telugu News