cricket: పోరాటపటిమ చూపుతున్న టీమిండియా బ్యాట్స్ మెన్ జాదవ్, పాండ్యా!

టీమిండియా, ఇంగ్లండ్ మ‌ధ్య కోల్ కతాలోని ఈడెన్ మైదానంలో జ‌రుగుతున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ జాద‌వ్‌, పాండ్యా రాణిస్తున్నారు. జాద‌వ్ 62 ప‌రుగులతో క్రీజులో ఉండ‌గా, పాండ్యా 45 ప‌రుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల ధాటికి టీమిండియా కీల‌క‌ బ్యాట్స్‌మెన్ త‌క్కువ ప‌రుగుల‌కే అవుట‌యిన విష‌యం తెలిసిందే. ర‌హానే 1, రాహుల్ 11, కోహ్లీ 55, యువ‌రాజ్ 45, ధోనీ 25 ప‌రుగులకి వెనుదిరిగారు. ప్ర‌స్తుతం  టీమిండియా ముందు ఇంగ్లండ్ 322 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఉంచిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం టీమిండియా ఐదు వికెట్ల న‌ష్టానికి  257 ప‌రుగులతో క్రీజులో ఉంది. టీమిండియా విజ‌యం సాధించాలంటే మ‌రో 42 బంతుల్లో 65 ప‌రుగులు చేయాల్సి ఉంది.

More Telugu News