cricket: కుప్పకూలిన టీమిండియా టాప్ ఆర్డర్

టీమిండియా, ఇంగ్లండ్ మ‌ధ్య క‌ల‌క‌త్తాలోని ఈడెన్ మైదానంలో జ‌రుగుతున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో భార‌త టాప్ ఆర్డ‌ర్ కుప్ప‌కూలింది. ఇంగ్లండ్ ఇచ్చిన 322 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో క్రీజులోకి వ‌చ్చిన‌ టీమిండియా ఓపెన‌ర్లు ర‌హానే, కేఎల్ రాహుల్ చెప్పుకోద‌గ్గ స్కోరు చేయ‌కుండానే వెనుదిరిగిన విష‌యం తెలిసిందే. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 55 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద అవుట్ కాగా, యువ‌రాజ్ సింగ్ కూడా 45 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం క్రీజులో మ‌హేంద్ర సింగ్ ధోనీ, జాద‌వ్ ఉన్నారు. టీమిండియా స్కోరు నాలుగు వికెట్ల‌ న‌ష్టానికి 27 ఓవ‌ర్ల‌లో 140గా ఉంది. ధోనీ 14 ప‌రుగుల‌తో క్రీజులో ఉండ‌గా, జాద‌వ్ ఇంకా ప‌రుగుల ఖాతా తెర‌వ‌లేదు.

More Telugu News