chiru: కాళహస్తి ఆల‌యంలో మెగాస్టార్ చిరంజీవి.. భారీగా త‌ర‌లివ‌చ్చిన అభిమానులు.. తోపులాట‌!

మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించారు. జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపంలో ఉన్న‌ రాజగోపుర మహాకుంబాభిషేకం క్రతువులో భాగంగా ఈ రోజు విశ్వకల్యాణ శాంతి మహాయజ్ఞం చేస్తున్నారు. ఈ రాజ‌గోపురాన్ని నవయుగ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ కార్యక్రమానికి చిరు త‌న‌ కుటుంబసభ్యులతో కలిసి హాజ‌ర‌యి చండీసహిత అతిరుద్రయాగంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున రావ‌డంతో ఆల‌యంలో తోపులాట చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి వీధులన్నీ చిరు అభిమానుల‌తో కిక్కిరిసిపోయాయి.

More Telugu News