cricket: 37 ప‌రుగుల‌కే రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. క్రీజులో కోహ్లీ, యువీ

టీమిండియా, ఇంగ్లండ్ మ‌ధ్య ఈడెన్ మైదానంలో జ‌రుగుతున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. ఇంగ్లండ్ ఇచ్చిన 322 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో క్రీజులోకి వ‌చ్చిన‌ టీమిండియా ఓపెన‌ర్లు త‌డ‌బ‌డ్డారు. ర‌హానే అవుట్ అయిన కొద్ది సేప‌టికే కేఎల్ రాహుల్ కూడా భారీ షాటుకి ప్ర‌య‌త్నించి అవుట‌య్యాడు. ప్ర‌స్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 22, యువ‌రాజ్ సింగ్ 3 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు రెండు వికెట్ట న‌ష్టానికి 8 ఓవ‌ర్ల‌లో 43గా ఉంది. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో విల్లే, బాల్‌కి చెరో వికెట్ ద‌క్కాయి.

More Telugu News