cricket: తొలి ఓవర్లోనే ఓ సిక్సు, ఫోరు బాదిన రాహుల్.. రెండో ఓవర్లోనే రహానే ఔట్!

టీమిండియా, ఇంగ్లండ్ మ‌ధ్య కోల్‌క‌తాలోని ఈడెన్ మైదానంలో జ‌రుగుతున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇచ్చిన 322 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెన‌ర్లుగా ర‌హానే, కేఎల్ రాహుల్ క్రీజులోకి వ‌చ్చారు. అయితే, మొద‌టి ఓవ‌ర్లోనే రాహుల్ రెచ్చిపోయాడు. ఒక సిక్సు, ఒక ఫోరుతో ప‌ది ప‌రుగులు సాధించాడు. ఇక ర‌హానే అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచాడు. రెండో ఓవ‌ర్ల‌లోనే 1 ప‌రుగు వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద అవుట‌య్యాడు. అనంత‌రం క్రీజులోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ వ‌చ్చాడు.  ప్ర‌స్తుతం టీమిండియా స్కోరు రెండు ఓవ‌ర్ల‌కి 14/1 గా ఉంది.

More Telugu News