firing: జాతీయ రహదారిపై ఉగ్రదాడి.. ఇద్దరు సైనికుల మృతి.. కొనసాగుతున్న కాల్పులు

అస్సాంలో ఉగ్ర‌వాదులు మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. అస్సాంలోని తింకూసియా జగూన్‌ ప్రాంతంలో రైఫిల్స్‌ జవాన్లకు చెందిన కాన్వాయ్‌పై ఈ రోజు ఉగ్ర‌వాదులు గ్రెనేడ్లు విసిరి దాడికి దిగారు. 53వ నెంబర్‌ జాతీయ రహదారిపై ప‌లు వాహనాలు ప్రయాణిస్తున్న స‌మ‌యంలో ఈ దాడి జ‌రిగింద‌ని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ దాడి నుంచి వెంటనే తేరుకున్న భద్రతాదళాలు ఉగ్ర‌వాదుల‌పై ఎదురుదాడికి దిగాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం కాల్పులు కొన‌సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇండో-మయన్మార్‌ సరిహద్దులో శీతాకాలంలో నిర్వహించే పనగ్‌సూ వేడుక నుంచి మూడు టూరిస్టు వాహనాలతో పాటు వ‌స్తున్న రైఫిల్‌ వాహనంపై ఈ దాడి జ‌రిగింది.

More Telugu News