cricket: ఈడెన్ వ‌న్డే: టీమిండియా ల‌క్ష్యం 322 పరుగులు

టీమిండియా, ఇంగ్లండ్ మ‌ధ్య కోల్‌క‌తాలోని ఈడెన్ మైదానంలో జ‌రుగుతున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 321 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో రాయ్ 65, బిల్లింగ్ 35, బ‌యిర్ స్ట్రో 56, మోర్గాన్ 43, బ‌ట్ల‌ర్ 11, అలీ 2, స్టోక్స్ 57 (నాటౌట్‌), వోక్స్ 34, ప్లంకెట్ 1 ప‌రుగులు చేశారు. భార‌త బౌల‌ర్లలో పాండ్యా 3 వికెట్లు తీయ‌గా, జ‌డేజా రెండు వికెట్లు తీశాడు. బుమ్రాకి ఒక వికెట్ ద‌క్కింది. ఇంగ్లండ్ కు ఎక్స్ ట్రాల రూపంలో 17 పరుగులు వచ్చాయి. మొదట క్రీజులో నిల‌క‌డ‌గా ఆడిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చివ‌ర్లో ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించారు.

More Telugu News