jallikattu: త‌మిళ‌నాడులో ఇద్దరు యువ‌కుల‌ ప్రాణాల‌ను తీసిన జ‌ల్లికట్టు క్రీడ

తమిళనాడులో జల్లికట్టు క్రీడ‌ కోసం ఆరో రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అత్య‌వ‌‌స‌ర ఆదేశాన్ని తీసుకువచ్చిన‌ప్ప‌టికీ వారు నిర‌స‌న విడవ‌డం లేదు. అయితే, మ‌రోవైపు ఈ రోజు త‌మిళ‌నాడులోని ప‌లుచోట్ల జ‌ల్లిక‌ట్టు క్రీడ‌ను నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే జ‌ల్లిక‌ట్టు నిర్వ‌హిస్తోన్న స‌మ‌యంలో ఈ రోజు ఇద్ద‌రు యువ‌కులు మృత్యు వాత‌ప‌డ్డారు. పుదుకొట్టాయ్‌లో పెద్ద ఎత్తున‌ నిర్వ‌హిస్తోన్న జ‌ల్లిక‌ట్టులో అప‌శ్రుతి చోటుచేసుకొని అందులో పాల్గొంటున్న ఇద్ద‌రు యువ‌కులు మృతి చెందార‌ని అక్క‌డి పోలీసులు తెలిపారు.

More Telugu News