cricket: 98 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్... అర్ధసెంచరీ చేసిన రాయ్

టీమిండియా, ఇంగ్లండ్ మ‌ధ్య  కోల్‌క‌తాలోని ఈడెన్ మైదానంలో జ‌రుగుతున్న చివ‌రి వ‌న్డే మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 98 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది. 35 ప‌రుగులు చేసిన బిల్లింగ్స్.. జ‌డేజా బౌలింగ్‌లో బుమ్రాకి క్యాచ్ ఇచ్చుకుని వెనుదిరిగాడు. మ‌రో ఓపెన‌ర్ జేజే రాయ్ 48 బంతుల‌కి 60 ప‌రుగులు చేసి క్రీజులో ఉన్నాడు. బిల్లింగ్ అవుట‌య్యాక క్రీజులోకి బ‌యిర్ స్ట్రో వ‌చ్చాడు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ స్కోరు 18 ఓవ‌ర్ల‌కి 102/1 గా ఉంది.  

More Telugu News