accident: విజ‌య‌వాడ శివారులో ఆర్టీసీ బ‌స్సు బీభ‌త్సం.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు

విజ‌య‌వాడ శివారు మీదుగా ప్ర‌యాణికుల‌తో వెళుతున్న ఓ ఆర్టీసీ బ‌స్సు ఈ రోజు బీభ‌త్సం సృష్టించింది. బ‌స్సు ప‌రిటాల వ‌ద్దకు చేరుకోగానే ఒక్క‌సారిగా అదుపుత‌ప్పి రోడ్డుపక్క‌న ఉన్న జ‌నాల‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.  

More Telugu News