: వెంటనే కూనేరు వెళ్లండి: మంత్రులకు చంద్రబాబు ఆదేశం

ఉత్తరాంధ్ర మంత్రులంతా తక్షణం రైలు ప్రమాదం జరిగిన కూనేరుకు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ ఉదయం ప్రమాద సంఘటన గురించి తెలుసుకున్న ఆయన, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఆయన, సహాయ చర్యలను ముమ్మరం చేయాలని విజయనగరం, విశాఖ జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు.

గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని కలెక్టర్లకు సూచించిన చంద్రబాబు, అందుబాటులోని మంత్రులు సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని, బాధితులకు అండగా నిలవాలని అన్నారు. మృతదేహాలు స్వస్థలాలకు తరలింపు బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ సైతం ప్రమాదంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

More Telugu News